(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజస్థాన్ రాష్ట్రం సిరోహిలో ఓ దుకాణం వద్ద ఉన్న ఫుట్ పాత్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఫుట్పాత్ కూలిపోవడంతో అక్కడున్న వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఏం జరిగిందో అని స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది.
#WATCH: Portion of a footpath built over a drain, collapsed yesterday in Sirohi; 2 injured. #Rajasthan pic.twitter.com/4Ja6pgEt94
— ANI (@ANI) October 26, 2019
వివరాల్లోకి వెళితే..ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ షాపులోకి వెళ్లి వస్తుండగా దుకాణం ముందు ఉన్న డ్రైనేజీపై నిర్మించిన ఫుట్పాత్ ఒక్కసారిగా కుంగిపోయింది. దానిపై ఆ క్షణమే నడిచి వస్తున్న వ్యక్తి అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి కూడా పుట్ పాత్ కూలడంతో గాయాలపాలయ్యాడు. అప్పటి వరకూ అంతా బాగానే కనిపించినా రెప్పపాటులో ఊహించని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నజీర్ మహ్మద్, పర్వేజ్ ఖాన్లుగా గుర్తించారు. వీరితో పాటు ఫుట్ పాత్పై నిలిపిన బైక్ ఇతర వస్తువులు డబ్బాలు అన్ని కూడా అందులో పడిపోయాయి. వెంటనే అక్కడున్న చుట్టుపక్కల వాళ్లు ఘటనాస్థలానికి చేరుకొని గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.