AP Election Commissioner: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీలో భారీగా ఓట్లు గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై విపక్షాలు, ప్రజల నుండి సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయనను అర్జంట్ గా ఢిల్లీకి రావాలంటూ సీఈసీ ఆదేశించింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా తీసుకురావాలని ముఖేశ్ కుమార్ మీనాకు సీఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది. సీఈసీ రాజీవ్ కుమార్ తో ముఖేశ్ కుమార్ మీనా ఈ వేళ భేటీ కానున్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిలో ఓట్ల చేర్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్చంద సంస్థలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఈసీ కూడా ఆదేశించింది. ఈ తరుణంలో ముఖేశ్ కుమార్ మీనాకు ఢిల్లీ నుండి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.