టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావుకు కోపం తెప్పించాయి. భగవంతుడైన శ్రీరాముడితో చంద్రబాబును పోలుస్తూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు జీవిఎల్. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని జీవిఎల్ హెచ్చరించారు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరాటం “లోక”కళ్యాణం కోసం కాదు. “లోకేష్”కళ్యాణార్థం అని అందరికీ తెలుసునని సెటైర్ వేశారు. రాష్ట్రంలో అధికార వైసీపీని ఎదుర్కొవడం ఒక్క టీడీపీ వల్ల సాధ్యం కాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే రాబోయే ఎన్నికల నాటికి జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అన్న భావన టీడీపీ వర్గాల్లో ఉంది. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని చెబుతోంది. జనసేనతోనే తమ పొత్తు అంటూ జీవీఎల్, సోము వీర్రాజులు పదేపదే చెబుతూనే ఉన్నారు.
అయితే రీసెంట్ గా జరిగిన టీడీపీ నేతల సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ … వైసీపీని కూల్చేందుకు అందరి సాయం తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా రామాయణ ఇతి వృత్తం గురించి చెబుతూ నాడు శ్రీరాముడు రావణుడ్ని వధించే శక్తి ఉన్నా అందరి సాయాన్ని కోరారనీ చెప్పారు. రావణుడి వధకు వానరులు, ఉడత.. రావణుడి తమ్ముడు విభీషణుడి సాయాన్ని కూడా రాముడు తీసుకున్నారని అన్నారు. ఇలా అయన్న పాత్రుడు మాట్లాడటంపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా స్పందించి టీడీపీపై విమర్శలు చేశారు.
బాబు నోట ఆ భాషనా..? కర్నూలులో సహనం కోల్పోయి వేరావేశంతో..