NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు – జ‌గ‌న్ రెండు సంత‌కాలు తేలిపోయాయ్‌… జ‌నం ఎవ‌రికి జై కొడ‌తారో..?

వ‌చ్చేది ఏ ప్ర‌భుత్వ‌మో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంత‌కాలు ప్ర‌క‌టిం చాయి. దీంతో ఈ రెండు సంత‌కాల‌పై జ‌నంలో చ‌ర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఎన్డీయే కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తొలి సంత‌కం ప్ర‌క‌టించారు. అయితే.. ఇది వివాదానికి దారితీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను అధికారంలోకి రాగానే.. తొలి సంత‌కం డీఎస్సీపైనే ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

అది కూడా.. మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా తాజాగా రెండు రోజుల కిందట తన తొలి సంత‌కాన్ని ప్ర‌క‌టించారు. తాను మ‌రోసారి అదికారంలోకి వ‌స్తే.. తొలి సంత‌కం .. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పైనే ఉంటుంద‌ని చెప్పారు. ఇక‌, ఇద్ద‌రి సంత‌కాల వ్య‌వ‌హారాన్ని చూస్తే.. రెండు హాట్ టాపిక్‌లే.. వైసీపీ హ‌యాంలో ఎన్నిక‌ల‌కు ముందు మెగా డీఎస్సీ వేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల అధికారంలోఒక్క‌టి కూడా వేయ‌లేక పోయారు.

అర‌కొర పోస్టుల‌తో (6 వేల‌తో) డీఎస్సీ వేసినా.. అది ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ముందు కావ‌డంతో స‌క్సెస్ కాలేదు . తాజాగా ఎన్నిక‌ల సంఘం ఈ నోటిఫికేష‌న్‌పై బ్రేక్ వేసింది. దీంతో ఇది ఆగిపోయింది. ఫ‌లితంగా ఒక్క డీఎస్సీ కూడా వేయ‌ని ప్ర‌భుత్వంగా సీఎం జ‌గ‌న్ హ‌యాం నిలిచిపోయింది. దీనిని కార్న‌ర్ చేస్తూ.. చంద్ర బాబు నిరుద్యోగుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మెగా డీఎస్సీకి ప్ర‌క‌ట‌న చేశారు. తొలి సంత‌కం దీనిపైనే ఉంటుంద‌న్నారు.

ఇక‌, చంద్ర‌బాబు కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు వలంటీర్ల‌ను నిలుపుద‌ల చేశార‌ని… ప్ర‌జ‌ల‌కు చేరువైన వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు దూరం చేశార‌ని ఆరోపిస్తున్న సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంపైనే త‌న తొలి సంత‌కం ఉంటుంద‌ని అన్నారు. అయితే.. ఈ రెండు అంశాలు కూడా.. కొన్నివ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా ఎక్క‌డైనా విశేష సంఖ్య‌లో ప్ర‌యోజ‌నం కూర్చే ప‌థ‌కాల‌పై సంత‌కాలు చేస్తారు.

కానీ, ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ముడిప‌డిన రెండు కీల‌క విషయాల‌పై కీల‌క నాయ‌కులు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పెద్ద‌గా చ‌ర్చ‌కు రాకుండానే పోయాయి. అయితే.. డీఎస్సీపై నిరుద్యోగులు కొంత మేర‌కు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో వ‌లంటీర్లు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. అంటే.. రెండు భిన్న‌మైన అంశాల‌పై ఇద్ద‌రు వాగ్దానం చేయ‌డంతో పెద్ద‌గా ఇది రాజ‌కీయ చ‌ర్చ‌కు రాకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju