స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సుబ్రమణ్యం, అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ లేకపోవడంతో వైసీపీ కైవశం చేసుకున్నది. రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు గాను అయిదు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మరో నాలుగు స్థానాలకు (పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, శ్రీకాకుళం, కర్నూలు ఒక్కొక్క స్థానాలకు) ఎన్నికలు జరగనున్నాయి. అలానే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనున్నది. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలైన ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు స్థానాలకు, పట్టభద్రుల నియోజకవర్గాలై ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ