Nimmagadda Ramesh : నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ . గత కొద్దికాలంగా ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలు ముగియడంతో రెండో విడతకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఎస్ఈసీ తీసుకునే సంచలన నిర్ణయంతో ఏపీ మాజీ సీఎం , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు షాక్ గా మారనుందని ప్రచారం జరుగుతోంది.
Nimmagadda Ramesh నిమ్మగడ్డ సంచలనం
ఏపీలో రెండవ దశ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ 3వేల 328 గ్రామపంచాయితీలకు ఎన్నికలు నోటిఫికేషన్ రాగా.. 539 సర్పంచ్ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 2వేల 789 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఈనెల 13న పోలింగ్ జరుగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2వేల 789 గ్రామ పంచాయతీలకు గాను.. 7వేల 510 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో మొత్తం 33వేల 570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 12వేల 605 ఏకగ్రీవాలయ్యాయి. మిగతా 20వేల 965 వార్డులకు గాను 44 వేల 879 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రెండో దశ పోలింగ్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఈ దూకుడు …
అయితే, ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు స్వీకరణ ప్రక్రియతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ కారణంలో ఎన్నికలు వాయిదా వేసింది ఎస్ఈసీ.. అయితే, అదే ప్రక్రియ తిరిగి ఎస్ఈసీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే.. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, తిరిగి ప్రారంభిస్తారా? కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా, పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవ మంత్రంతో టీడీపీ భారీగా సీట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అదే ఎత్తుగడతో ముందుకు సాగితే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.