NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఏపీలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. వాహనదారులు నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై యర్రగొండపాలెంలో ఓ నిశ్చితార్ధానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అంభాపురానికి చెందిన వినోద్, నాని, వీరేంద్ర గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road Accident

మరో పక్క పల్నాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుతురు మృతి చెందారు. పిడుగురాళ్ల మండలంలోని శ్రీనివాస నగర్ వద్ద అయ్యప్పనగర్ కు చెందిన యనమల నరసింహరావు (40), ఆయన కూతురు శ్రీనిధి (15) లు పుస్తకాల కొనుగోలు కోసం బ్రాహ్మణపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూరుతు ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే జిల్లాలో పాత నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోగ నాగేశ్వరరావు (46) అదే గ్రామానికి చెందిన నాదెండ్ల మోహన్ రావు తో కలిసి ద్విచక్ర వాహనంపై వ్యవసాయ మోటారు మరమ్మత్తులు కోసం వినుకొండ వెళుతుండగా, ఎర్రగొండపాలెం వైపు వెళ్తున్న వినుకొండ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, నాదెండ్ల మోహన్ రావు తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయన పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాధమిక చికిత్స అనంతరం నరసరావుపేట కు తరలించారు. ఇక గుంటూరు జిల్లాలో జరిగిన ఓ యువకుడు మృతి చెందారు. మేడికొండూరు గ్రామానికి చెందిన గుండాల సామి ఏసు (24) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుంటూరు వైపు వెళ్తున్న లారీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామి ఏసు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Punganur: పుంగనూరు ఘటనలో 500 మంది నిందితులు .. అది ప్రీ ప్లాన్ అటాక్ అని పేర్కొన్న ఎస్పీ రిషాంత్ రెడ్డి

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju