టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ణాటక సరిహద్దు పెద్దురుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో, సభలకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు. తన సొంత నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటారా అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఏ చట్టం ప్రకారం తాను నియోజకవర్గంలోకి వెళ్లకూడదో నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకు అనుమతులు ఇవ్వరంటూ పోలీసులను చంద్రబాబు నిలదీశారు. పోలీసులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏ చట్టంప్రకారం జీవో ను తీసుకువచ్చారో సమాధానం చెప్పాలన్నారు. 1946 నాటి చట్టసవరణను జీవోలో ప్రస్తావించలేదని అన్నారు. 1861 నాటి చట్టాన్ని ఇప్పుడు రుద్దుతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన జీవోకు చట్టబద్దత లేదని అన్నారు.ప్రభుత్వం, పోలీసుల దయాదాక్షిణ్యాలతో సభలు పెట్టుకోవాలా అని ప్రశ్నించారు. తన వాహనం ఇచ్చే వరకూ ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. అక్కడే మైక్ తీసుకుని మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. అనంతరం పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు ఇంటింటి యాత్రను ప్రారంభించారు. రోడ్ షో, సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు తన పర్యటనను ఇంటింటి యాత్రగా మార్చుకున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
అంతకు ముందు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు తొలగించారు. చంద్రబాబును స్వాగతం పలికేందుకు తరలివచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి బారికేడ్లు అక్కడ నుండి తొలగించారు. పోలీసులు అడ్డుకున్నా కార్యకర్తలు ముందుకు సాగారు.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?