NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Punganur (Chittoor): ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

Advertisements
Share

Punganur (Chittoor):  పుంగనూరు వద్ద బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పుంగనూరు మండలం అరవపల్లి గ్రామం వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. మృతులు పుంగనూరుకు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవి గా గుర్తించారు.

Advertisements
Road Accident

 

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంగా రావడం వల్ల అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వారి కుటుంబాలకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

 


Share
Advertisements

Related posts

కోర్టులపై జగన్ స్కెచ్…!

Srinivas Manem

జగన్ చాలా ఫాస్ట్ గా తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన పాయింట్ ఇది ! 

sekhar

Keto Diet: కీటో డైట్ పాటిస్తున్నారా..!? ముఖ్యంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!!

bharani jella