Bigg Boss 6: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ నుండి వరస్ట్ సీజన్ అనే టాక్ వినిపిస్తుంది. దాదాపు నాలుగు వారాలు పాటు హౌస్ లో సరైన గేమ్ కంటెస్టెంట్లు ఆడలేదు. ఈ క్రమంలో షో నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జున సైతం … ఇంటి సభ్యులపై మండిపడ్డారు. సరిగ్గా ఐదవ వారం నుండి హౌస్ అందరూ గేమ్ ఆడుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చివరాఖరికి వచ్చేసింది. అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రకారం హౌస్ లో లెక్కలు మారకుండా…బీబీ టీం తన ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకోవడానికి దాదాపు చివరిగా కొద్ది వారాల నుండి వ్యవహరిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా కంటెస్టెంట్ ఆదిరెడ్డిని ఫైనల్ వారంలో చేర్చడానికి బీబీ టీం పై పొలిటికల్ ఒత్తిడి ఎక్కువైనట్లు… దీంతో హౌస్ లో మిగతా కంటెస్టెంట్లను అతని గురించి బలి చేస్తున్నట్లు.. బయట ప్రచారం జరుగుతుంది.
ఫైమా, రాజ్ ఇద్దరిలో వాస్తవంగా…రాజ్ కి బదులు ఫైమా… ఎలిమినేట్ కావాలంట. కానీ ఫైమా… ఎలిమినేట్ అయితే రాజ్ కి ఆమె ఓట్లు పడతాయని ముందుగానే..రాజ్ నీ హౌస్ నుండి పంపించడం జరిగిందంట. ఇక ఇప్పుడు ఆదిరెడ్డి ఫైనల్ వీక్ లో ఉండాలని.. సత్య, ఇనాయా మధ్య ఎలిమినేషన్ ఉండేలా..బీబీ టీం డిసైడ్ అయిందట. దాదాపు ఇనాయా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చివరి వారంలో ఇనాయా ఉంటే ఆది రెడ్డికి ఓట్లు పడవని…బీబీ టీం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇదే జరిగితే ఇంక తెలుగు బిగ్ బాస్ షో ఎవరు చూడారని జనాలంటున్నారు. జనాలు ఓటింగ్ బట్టి కాకుండా షో నిర్వాహకులు బట్టి హౌస్ … నడిపిస్తే చూసే ఆడియన్స్ ని ఎదవలు చేయడంతో సమానం. ఈ రకమైన ఎజెండా బీబీ టీంకి ఉంటే… ఓటింగ్ ప్రక్రియ పెట్టకూడదని.. జనాలను తప్పుదోవ పట్టించుకోకూడదని.. తాజా వార్తలు పై సోషల్ మీడియాలో నేటిజన్స్ నుండి సీరియస్ కామెంట్లు వస్తున్నాయి.