Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం ఏడుగురిని నామినేట్ చేసి ఎవరిని హౌస్ నుండి ఎలిమినేట్ చేయలేదు. కానీ ఆడియన్స్ తో పాటు ఇంటి సభ్యులను బిగ్ బాస్ ఫుల్స్ చేయడం జరిగింది. ఆడియన్స్ చేత ఓట్లు వేయించుకొని.. ఒత్తిడికి గురిచేసి..ఎవరిని ఎలిమినేట్ చేయకపోవడం పట్ల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్ లో జరగనుంది. సోమవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఈ ప్రోమోలో ఇంటి సభ్యులకు నామినేషన్ సమయంలో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వటం జరిగింది. ప్రతి కంటెస్టెంట్ ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలని కండిషన్ పెట్టారు. గత సీజన్ లలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరినీ నామినేట్ చేసేవాళ్లు. కానీ సీజన్ సిక్స్ లో రెండో వారంలో ఒక్కొక్కళ్ళు ఒకరినీ మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలపటం సంచలనం రేపింది.
ఈ క్రమంలో ఆది రెడ్డికి ఇంకా ఆరోహికి గొడవ జరిగినట్లు ప్రోమోలో చూపించారు. ఒక ఆరోహితో మాత్రమే కాదు.. రోహిత్ మెరీనా లతో కూడా ఆదిరెడ్డికి గొడవ జరిగింది. ఇంకా శ్రీహాన్ కి గీతు రాయల్ కి, గీతు రాయల్ వర్సెస్ నేహా చౌదరికి గొడవ జరగటం ప్రోమొలో చూపించారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మాత్రం ఇంటి సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారి తీసినట్లు తెలుస్తోంది.