Bigg Boss 6: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్…లో పాలిటిక్స్ ఎంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా బీబీ టీం తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిస్తున్నారని ఇటీవల ప్రచారం జరుగుతుంది. ముఖ్య ఇనాయ ఎలిమినేట్ కావటాన్ని బిగ్ బాస్ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సీజన్ సిక్స్ లో స్టార్టింగ్ నుండి ఇనాయ అద్భుతమైన గేమ్ ఆడింది. నెగిటివిటీతో ఎంట్రీ ఇచ్చి తల్లి ప్రేమను పొంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హౌస్ లో అందరూ తనని టార్గెట్ చేసినా గాని… గేమ్ పరంగా ఎక్కడ నిరుత్సాహం చెందకుండా ఎప్పటికప్పుడు పుంజుకుంటూ మంచి పోటీ ఇచ్చింది.
నామినేషన్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్ పరంగా టాప్ లో ఉండేది. దీంతో ఇనాయ మినిమం టాప్ త్రీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. అటువంటి కంటెస్టెంట్ ని సరిగ్గా ఫైనల్ వారం ముందు ఎలిమినేట్ చేయటం వెనకాల పొలిటికల్ హస్తం ఉందని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. హౌస్ లో ఓ కంటెస్టెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పొలిటికల్ పార్టీ అండ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇనాయ ఎలిమినేషన్ విషయంలో హోస్ట్ నాగార్జున లేటెస్ట్ గా బీబీ టీంతో గొడవకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రియాల్టీ షోలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని చాలా సీరియస్ అయ్యారట. ఛానల్, బీబీ యాజమాన్యంతో పాటు… ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన పొలిటికల్ లీడర్లతో సైతం నాగార్జున ఫోన్లో మాట్లాడటం జరిగిందంట.
దీనిలో భాగంగా ఓ రాజకీయ నాయకుడిని నువ్వు జనాల ఓట్లతో ఇంత దూరం రాలేదా..? అని చాలా సీరియస్ ప్రశ్నలు వేసి.. మండిపడటం జరిగిందంట. అంతేకాదు నెక్స్ట్ సీజన్ నుండి హోస్టింగ్ కి గుడ్ బై కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు షో నిర్వాహకులు తలవంచటంతో … నాగార్జునకి చిరాకు వచ్చి ఇదే తన లాస్ట్ సీజన్ అని బీబీ టీం వాళ్లకు ఫుల్ డోస్ ఇచ్చినట్లు సమాచారం.