25 లక్షల మంది మహిళలకు రూ. 4687 కోట్లు జమ
సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఓ సంచలనం. దేశంలోనే సంక్షేమ పథకాల కోసం ఓ కేలండర్ విడుదల చేసి మరీ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఎకౌంట్లలో జమ చేస్తూ… వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచిన జగన్ సర్కారు తాజాగా చేయూత పథకం ద్వారా 25 లక్షల మంది మహిళలకు, రూ. 4687 కోట్ల రూపాయల సాయాన్ని అందించారు. చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోనే పేద కుటుంబాలకు దన్నుగా నిలుస్తుందని… ఆ కుటుంబాలు ప్రగతి బాటలో నిలిచేందుకు దోహదకారికా నిలుస్తాయన్నారు జగన్…
నెలకు పింఛన్ రూపంలో వెయ్యిద్దామనుకున్నాం…
నాడు 45 ఏళ్ల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మెలకు పింఛన్ ఇస్తానని చెబితే ఎటకారం చేశారని… 45 ఏళ్ల మహిళలకు ఎలా ఇస్తావ్… ఎందుకిస్తావంటూ ప్రశ్నించారని ఆ జ్ఞాపకాలను జగన్ గుర్తుచేసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది ఇచ్చిన మాట ప్రకారం ఏటా 18 వేల 750 రూపాయలు అందిస్తున్నానన్నారు జగన్… ఇలా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు ఈ పథకం కింద భరోసా కల్పిస్తానన్నారు. నాడు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వాలనుకున్నామని… అయితే ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ. 18750 చేసి… నాలుగేళ్లలో రూ. 75 వేలుగా ఇవ్వబోతున్నామన్నారు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఆ కిక్కే వేరప్పా…
ఆ ఫ్లో తగ్గలేదు… చేయూత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో తాను చేసే ప్రసంగాలకు ధీటుగా మాట్లాడారు. మొత్తంగా చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఉండే కిక్కే వేరప్పా అన్నట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని చూడొచ్చు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా… 18750, 18750, 18750, 18750 అంటూ వరసుగా నాలుగేళ్లపాటు అక్కాచెల్లెమ్మలకు అన్నగా… సాయం చేస్తామన్నారు. నాడు పాదయాత్రలో మహిళల కష్టాలను చూసి… ఆ తర్వాత చేయూత పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామన్నారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పాం… దేవుడి దయతో కచ్చితంగా ఆ కార్యక్రమాన్న ఈ రోజు మీ తమ్ముడిగా, అన్నగా అమలు చేస్తున్నానన్నారు జగన్. దేవుడి దయతో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు సీఎం జగన్.