Cinima: దేశంలో సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు సినిమా థియేటర్ లకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఓటిటి లకి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత సినిమా వ్యాపారంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకులను థియేటర్ తీసుకురావడానికి.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మరో పక్క ప్రభుత్వాలు సైతం తీసుకుంటున్న నిర్ణయాలు సినిమా వ్యాపారానికి మరింత నష్టాల్లోకి తీసుకెళ్లి పోయే పరిస్థితి ఏర్పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయినా థియేటర్ లో పడిన తర్వాత కొద్ది నెలలకే ఓటీటి లో ప్రత్యక్షమయ్యే పరిస్థితులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో.. ప్రేక్షకులు కూడా పెద్దగా సినిమా థియేటర్ లలో మూవీ చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ పరిణామాలతో ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఓటీటి లో విడుదలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరోపక్క సినిమా ధియేటర్ల వ్యాపారం మూత పడినట్లే అన్న టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో 75 రూపాయలకే సినిమా చూసే రీతిలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Mahesh-Rajamouli: రాజమౌళితో సినిమా.. మహేశ్ మూడేళ్లు అంకితం ఇవ్వాల్సిందేనా?
మరో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన “RRR”..!!
విషయంలోకి వెళ్తే ఈనెల 16వ తారీకు జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ లలో దాదాపు నాలుగు వేల ధియేటర్లలో ₹75 సినిమా చూసే రీతిలో అవకాశం కల్పించడం జరిగింది. సరిగ్గా ఆ సమయానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా “బ్రహ్మాస్త్ర” విడుదల కానుంది. బాలీవుడ్ కపుల్స్ రణబీర్ కపూర్, ఆలియాభట్ కలిసి నటించిన ఈ సినిమా ఈ నెల 9వ తారీకు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి మొత్తం మీద ఆరోజు.. 16వ తారీకు దేశవ్యాప్తంగా 75 రూపాయలకే మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూసే అవకాశాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది.