pawan-pooja hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఊహించని షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్లను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. గతంలో పవన్-హరీష్ల కాంబోలో వచ్చిన `గబ్బర్ సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
దీంతో వీరి తాజా ప్రాజెక్ట్పై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` టైటిల్ను కన్ఫార్మ్ చేశారు. సందేశంతో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ చిత్రంలో పవన్ కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. దీనిపై ఇప్పటికే మేకర్స్ స్పష్టత ఇచ్చారు. దీంతో పవన్ కు జంటగా పూజాను ఊహించుకుంటూ అభిమానులు తెగ సంభరపడిపోతున్నారు. కానీ, లెటెస్ట్ సమచారం ప్రకారం.. పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుందట. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు.
అందుకు కారణం పవన్నే. ప్రస్తుతం ఆయన క్రిష్ డైరెక్షన్లో `హరిహర వీరమల్లు` అనే సినిమా చూస్తున్నాడు. ఇది పూర్తైతే గానీ `భవదీయుడు భగత్ సింగ్` పట్టాలెక్కదు. అందుకు చాలా సమయం పట్టాలే కనిపిస్తోంది. అందుకే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పూజా ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.