SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `సర్కారు వారి పాట`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
అలాగే దర్శకనటుడు సముద్రఖని విలన్గా చేయగా.. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ చిత్రం ఓ ఊపు ఊపేస్తోంది. 12 రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ. 105.69 కోట్ల షేర్.. రూ.169.60 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్షన్స్ చేసిన ఈ మూవీ.. ఇంకా చాలా చోట్ల సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
దాని ప్రకారం.. సర్కారు వారి పాట డిజిటెల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు సాలిడ్ ధరకు సొంతం చేసుకున్నారట. అయితే ఈ మూవీ జూన్ 24 నుంచి ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయనున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారింది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.