ఈరోజుల్లో అవతలి వారిని అదరగొట్టాలంటే కత్తులతో.. కర్రలతో బెదిరించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఒకసారి దగ్గినా లేక “హాచ్చి…!“ అని తుమ్మినా చాలు… జనాలు వణికిపోతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి. అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మాయదారి రోగం యొక్క లక్షణాల్లో జలుబు మరియు దగ్గు చాలా కీలకం. అయితే అలాంటి వేళలో జాగ్రత్తగా వ్యవహరించి సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సిన నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తమ ఆరోగ్యం తో పాటు అవతలి వారి ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పడేస్తే ఏమనాలి?
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎంతో మంచి నాయకుడిగా పేరున్న విషయం అందరికీ తెలిసిందే. అతనిపై మరియు అతని స్ఫూర్తిదాయకమైన నాయకత్వంపై ఎప్పుడూ ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటుంది. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. మంత్రి కేటీఆర్ తీవ్రమైన జలుబు మరియు తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉండగా అదే సమయంలో అయినా సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో టెక్స్ టైల్స్ పార్కులో పనులను ప్రారంభించారు.
అయితే ఆ సందర్భంగా చాలా మంది ప్రజల మధ్యలో ఉన్న అతను పదేపదే తుమ్ముతూ మరియు కర్చీఫ్ తో ముక్కుని తుడుచుకుంటూ కనిపించారు. అసలు చేతిలో ఏనాడూ తువ్వాలు కానీ కర్చీఫ్ కానీ పట్టుకొని తిరిగే అలవాటులేని కేటీఆర్ అందుకు భిన్నంగా ఒక గులాబీ రంగు తువ్వాలుని పట్టుకొని పదేపదే తుమ్మడం మరియు జలుబు వల్ల ముక్కు ని శుభ్రం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. బాధ్యతారాహిత్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు.
లాక్ డౌన్ పీరియడ్ లో వీలైనంత వరకూ ఎవరిని గుమిగూడవద్దు వద్దు అని ఆదేశించాల్సిన నాయకులే స్ఫూర్తిని మరచి అందుకు భిన్నంగా తుమ్ముతూ…. దగ్గుతూ…. చీదుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే వివ్వెరపోవడం ప్రజల వంతు అయింది. నాలుగు రోజుల పాటు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొనకుంటే ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్.. తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదంటున్నారు. మరి దీనికి మంత్రి గారి సమాధానం ఏంటో..?
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!