Prabhas Mahesh: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “సలార్” సినిమాతో విజయం అందుకోవటం తెలిసిందే. 2023లో అన్ని సినిమాల్లో కంటే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా “సలార్” రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి పోటీగా షారుక్ నటించిన డంకి కూడా… “సలార్” దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఒకరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా ప్రభాస్ పై చేయి సాధించటం జరిగింది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వ్యక్తిత్వపరంగా ప్రభాస్ అందరికీ డార్లింగ్ అని అందరికీ తెలుసు. తోటి హీరోలతో చాలా కలివిడిగా కలిసిపోతాడు. ప్రభాస్ తో పనిచేసిన దర్శకులు లేదా హీరోయిన్స్ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు.
ఒక్కసారి ప్రభాస్ తో కనెక్ట్ అయ్యామంటే వదులుకోలేం అని అంటుంటారు. ప్రభాస్ భోజనాలతో చంపేస్తాడని అంతగా ఆతిథ్యం ఇస్తాడని.. చెబుతుంటారు. ఇక ప్రభాస్ కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ వచ్చినా గాని ఎక్కడా కూడా పొంగిపోకుండా అదే రేంజ్ లో అందరితో కలివిడిగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రభాస్ కోసం ఒక స్టోరీ సజెషన్ చేయడం జరిగిందట. విషయంలోకి వెళ్తే 2011లో “మిస్టర్ పర్ఫెక్ట్” అనే సినిమా రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇంకా తాప్సీ నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
వాస్తవానికి ఈ సినిమా స్టోరీ మొదట మహేష్ బాబుకి వినిపించడం జరిగిందట. కథ మొత్తం మిన్న మహేష్ ఈ కథకి నేను సూట్ కాను… కానీ ప్రభాస్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. దీంతో వెంటనే దర్శకుడు దశరాత్ మరియు నిర్మాత దిల్ రాజు ఇద్దరు.. ప్రభాస్ నీ కలవటం జరిగిందంట. అదే సమయంలో మహేష్ బాబు ప్రభాస్ కి ఫోన్ చేసి.. దిల్ రాజు మీ దగ్గరికి ఒక కథ తీసుకురాబోతున్నాడు. కరెక్ట్ గా మీరే సూట్ అవుతారు దానికి. చాలా కొత్తగా కూడా ఉంటుంది ట్రై చేయండి అని చెప్పారట. ఆ తర్వాత స్టోరీ మొత్తం విన్న ప్రభాస్ “మిస్టర్ పర్ఫెక్ట్” సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగిందట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ మరియు మహేష్ ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.