Wimbledon 2022: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) ఈ ఏడాది మిక్స్ డ్ డబుల్స్ వింబుల్డన్(Wimbledon) ఛాంపియన్ షిప్ లో.. సెమీ ఫైనల్ లో ఓటమి పాలు కావటం జరిగింది. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ చాంపియన్ షిప్లో మిక్స్ డ్ డబుల్స్లో క్రొయేషియాకు చెందిన తన భాగస్వామి మేటే పవిచ్(Mate Pavic) తో కలిసి అద్భుతమైన ఆట తీరుతో సెమీఫైనల్ వరకు దూసుకొచ్చిన సానియా మీర్జా….సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రావ్ జిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మ్యాచ్ లో తొలి సెట్ సునాయా సంగ గెలిచిన సానియా- పవిచ్..జంట చూసి రెండో సెట్ లో 2-0 ఆదిత్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలుస్తారని ప్రారంభంలో వాళ్ళ ఆడిన ఆట తీరు పట్టి అందరూ భావించారు. కానీ ప్రత్యర్థి జంట రెండో సెట్ తో పాటు మూడో సెట్ కూడా.. సానియా జంటకు ఛాన్స్ ఇవ్వకుండా.. ఓడించేశారు. దీంతో సానియా మీర్జా చిరకాల వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ చేజారిపోయింది. సెమీఫైనల్ వరకు పోరాడి ఓటమి పాలు కావడం జరిగింది. వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా సెమీఫైనల్ వరకు రావడం ఇదే ఫస్ట్ టైం.
సానియా కెరీర్ లో ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్..మిక్స్ డ్ డబుల్స్ లో గతంలో విజేతగా నిలిచింది. కానీ ఒక్క వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ లో మాత్రం టైటిల్ సాధించలేకపోయింది. మహిళల డబుల్స్ లో వింబుల్డన్ ట్రోఫీ 2015లో గెలవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సానియా మీర్జా కెరియర్ మొత్తంగా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం జరిగింది. ఇక కెరియర్ పరంగా యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ తర్వాత సానియా మీర్జా పూర్తిగా టెన్నిస్ కి గుడ్ బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో సానియా వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ఓడిపోవడం పట్ల ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.