Goodachari 2: టాలీవుడ్ లో క్రేజీ యంగ్ హీరోలలో అడవి శేష్ ఒకరు. కెరీర్ ఆరంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత “క్షణం” సినిమాలో హీరోగా నటించి సోలో నటుడిగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. హీరోగా “క్షణం” సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభించి గూడాచారి, ఎవరు , మేజర్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో సక్సెస్ఫుల్గా విజయం సాధించి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా తన కెరీర్ను ఎంతో ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.
కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “గూడాచారి” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. “గూఢచారి” సినిమా విజయం తర్వాత ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా “గూఢచారి 2” మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ పరిశ్రమలోని క్రేజీ నటుల్లో ఒకరైన ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ, ఆల్రెడీ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. ఇటీవల చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు దక్షిణాది సినిమాలలో నటించటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో నెగటివ్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఈ రకంగానే సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, బాబి డియోల్, సైఫ్ అలీ ఖాన్ వీళ్లంతా తెలుగు సినిమాలలో ఎక్కువ విలన్ పాత్రలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళకి తిరుగులేని స్టార్ హీరో ఇమేజ్ ఉండేది. కానీ ప్రజెంట్ సౌత్ సినిమాల హవా నడుస్తూ ఉండటంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు సౌత్ సినిమాలలో అవకాశాల కోసం… క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇక చాలామంది స్టార్ హీరో ఇమేజస్ కలిగిన వాళ్లు దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన దర్శకులతోనే పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాక ఇప్పుడు “గూడచారి” సీక్వెల్ “గూఢచారి 2″లో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.