Poonam Pandey: గర్భాశయ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ హీరోయిన్ పూనమ్ పాండే ఫుల్ చేయడం తెలిసిందే. స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో మరణించినట్లు శుక్రవారం ప్రకటించడం ఆ వార్త వైరల్ కావడం జరిగింది. సర్వైకల్ కాన్సర్ కారణంగా మరణించినట్లు పోస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే తాను బతికే ఉన్నానని శనివారం పూనమ్ పాండే వీడియోలో తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె మరణించినట్లు ముందు బాధపడిన వాళ్లు తర్వాత ఆమె చేసిన వీడియోపై ఎంతో సీరియస్ అయ్యారు. పబ్లిసిటీ కోసం ఇంత దారుణంగా దిగజారాలా.. అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే తాను సర్వైకల్ క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ రకమైన పోస్ట్ చేసి మరణించినట్లు తెలిపినట్లు కవరింగ్ చేసుకోవడం జరిగింది.
దీంతో పూనమ్ పాండే వ్యవహరించిన తీరుపై వైద్యులు మండిపడ్డారు. గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి పనులు మంచివి కాదని… దీనివల్ల మంచి కూడా చెడుగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూనమ్ పాండే చేసిన పని వల్ల సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుందని విమర్శిస్తున్నారు. మరి కొంతమంది ఇది కచ్చితంగా పబ్లిక్ స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. గతంలో ఈ రకంగానే పూనమ్ పాండే అనేక విషయాలలో వ్యవహరించిందని పలు ఉదాహరణలు కూడా సోషల్ మీడియాలో ఉదాహరిస్తున్నారు.
ఏదో రకంగా వార్తల్లో నిలవడం ఆమెకు ఏపాటి నుండో ఉన్న ఒక అలవాటు అని చెబుతున్నారు. 2011లో ఇండియాలో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలిస్తే బట్టలు విప్పి నగ్నంగా గ్రౌండ్ లో పరిగెడతానని స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో ధోనీ సేన ప్రపంచ కప్ గెలవగా… పూనమ్ పాండే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అనేక విషయాలపై కాంట్రవర్సీగా స్పందించి వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఏకంగా చనిపోయినట్లు పోస్ట్ చేసి తర్వాత వీడియోలో ప్రత్యక్షం కావడంతో చాలామంది పూనమ్ పాండే వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు.