Poonam Pandey: హీరోయిన్ పూనమ్ పాండే రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. సర్వేకల్ క్యాన్సర్ కారణంగా తాను మరణించినట్లు స్వయంగా అధికారిక సోషల్ మీడియా ఎకౌంటులో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 32 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు వార్త రావటం షాక్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది. ఇదే సమయంలో ఆమె మేనేజర్ సైతం ఆమె మరణించినట్లు వచ్చిన వార్త ధ్రువీకరించటం జరిగింది. దీంతో చాలామంది పూనమ్ పాండే మరణ వార్తపై ఆందోళన చెందారు. అయితే గతంలో ఈ రకంగానే కొన్ని ప్రకటనలు చేసి వివాదాస్పదంగా నిలిచింది.
కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించి నిత్యం వార్తల్లో నిలవడం పూనమ్ పాండేకి బాగా అలవాటు. దీంతో ఇది ఒక పబ్లిక్ స్టాండ్ అని చాలామంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లే నిజమయ్యాయి. తాను మరణించినట్లు వచ్చిన వార్త 24 గంటలు గడవకముందే పూనమ్ పాండే కానీ ఇంకా బతికే ఉన్నట్లు వీడియోలో తెలియజేసింది. ఇదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ పై అందరికి అవగాహన కలిగించే విధంగా పోస్ట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది. గర్భాశయ క్యాన్సర్ కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వారికి ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలని ఆలోచనతో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు స్పష్టం చేశారు.
అయితే తన మరణ వార్తతో బాధపడిన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం తథాంగంపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ సీరియస్ గా స్పందించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పూనమ్ పాండే.. ఆమె మేనేజర్ పై ఫిర్యాదు చేసింది. “పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్తో మరణించిందనే ఫేక్ న్యూస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగించింది..అని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఈ ఫిర్యాదు విషయంలో ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.