Intinti Gruhalakshmi: దివ్య తులసితో మాట్లాడిన తర్వాత ఇంట్లో అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తు బయటకి నడుస్తుంది.. దివ్యను అందరూ గట్టిగా హత్తుకుంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.. వీడలేక వీడలేక దివ్య ఇంట్లో నుంచి బయటకు నడుస్తుంది.దివ్య వెళ్ళిపోయినా బాధతో ఆ రాత్రంతా తులసికి నిద్ర పట్టదు . కాసేపటి తరువాత ఏమో చప్పుడు వినిపించడంతో లేచి బయటకు వెళ్లుస్తుంది.
పెరట్లో నందు గుణపం పెట్టి గుండె తవ్వుతూ కనిపిస్తాడు. ఎందుకిలా చేస్తున్నారని తులసి అడుగుతుంది. నాకున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు పక్కకు పో అంటూ తులసిని తోసేస్తాడు. తులసి కోపంగా మర్యాదగా అవుతారా ఆపరా అని అడుగుతుంది. ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నారని అడగగానే నా మీద నాకే కోపం.. నేను ఈ మధ్య ఏం చేసినా నాకు కలిసి రావడం లేదు అదే నా బాధని నందు చెబుతాడు. మీ బాధని మీరు పెద్దదిగా చేసి చూస్తున్నారు. అంగవైకల్యం ఉన్నవాళ్లు కూడా ఎన్నో రంగాలలో ముందుకు రానిస్తున్నారు వాళ్ళని తప్పు పడతారని వాళ్ళను చులకనగా చూస్తారని వాళ్ళు అక్కడితో ఆగిపోవడం లేదు కదా.. మీరు కూడా మీలో ఉన్న టాలెంట్ ను బయటకు తీయండి. అంతేకానీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని తులసి సలహా ఇస్తుంది.
Intinti Gruhalashmi: నాదే తప్పంటూ అందరి ముందుకి క్షమాపణలు చెప్పిన తులసి.. దివ్య ఇంటికి దూరం..
ఉదయం ఇంట్లో అందరూ కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే పరంధామయ్య వచ్చి మన పెరట్లో ఏదో పందికొక్కు గుంట తవ్వింది అమ్మ . రేపొద్దున కల్లా దాని అంతు చూడాలి అని పరంధామయ్య అనగానే.. తులసి పకపకా నవ్వేస్తుంది.. ఎదురుగా ఉన్న నందు మాత్రం చిన్న బుచ్చుకుంటాడు ఎందుకంటే.. ఈ విషయం తులసి నందుకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు కాబట్టి. ఇక నందు ఇన్ డైరెక్ట్ గా పందికొక్కు అంటూ తులసి కామెంట్స్ చేస్తుంది మావయ్య అని తులసి ఉంటుంది. అందులో కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ వస్తాడు. తులసి ఆ కొరియర్ తీసుకొని చదువుతూ ఉండగా.. లాస్య నేను చదువుతాను. ఈ ఇంటి కోడలు నేను ఉన్నాను గా అంటూ ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూస్తుంది.
లాస్య అనసూయమ్మ పరంధామయ్య దగ్గరికి వచ్చి కబ్జా చేసిన మీ ఆస్తి మళ్లీ తిరిగి వచ్చింది అత్తయ్య అని చెబుతుంది. భలే మంచి శుభవార్త చెప్పవు నీ నోట్లో పంచదార పోయాలి అని అనసూయ అంటుంది. ఇక ఈ ఆస్తిని ఎవరి పేరు మీద పెట్టాలని తులసి దగ్గరకు వెళ్లి పరంధామయ్య అడుగుతాడు అది మీ ఇష్టం మావయ్య మీరు ఎవరికీ ఇచ్చినా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అని తులసి అంటుంది కానీ నాకు మనసులో చిన్న అభద్రతాభావం ఉంది నువ్వైతే మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సరైన నిర్ణయం చెబుతావు నువ్వే సరైన వారికి ఈ ఆస్తి చెందేలా చూడమని తులసిని పరంధామయ్య అడుగుతాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో.. ఆ ఆస్తిని నందు తన పేరు మీద పెట్టమని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా నేను ఆ ఆస్తి తిరిగి వస్తే మన వాళ్ళు మనవరాలకు పెట్టాలని నిర్ణయించుకున్నామని పరంధామయ్య అంటాడు. ఆ సలహా ఇచ్చింది తులసి అని నందికి తెలిస్తే ఇంట్లో ఎలాంటి పెనుపరిణామాలు వస్తాయో చూడాలి.