యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొద్ది నెలల క్రితం భార్య, ప్రముఖ హీరోయిన్ సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ను కెరీర్పైనే పెట్టిన చైతు.. గత నెలలో `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. రీసెంట్గా `లాల్ సింగ్ చద్దా`తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చైతు ఓ కీలక పాత్రను పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీకి కూడా మిశ్రమ స్పందన దక్కింది.
ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చైతు తాను థియేటర్కు వెళ్లనని, థియేటర్లో సినిమాలు చూడటం తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. అప్పుడు ఆయన కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే థియేటర్కు వెళ్లకపోవడం వెనక కారణం ఏంటో తాజా ఇంటర్వ్యూలో చైతు వివరించాడు. చైతు మాట్లాడుతూ.. `నా ఫస్ట్ మూవీ జోష్ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూడాలన్న ఉద్దేశంతో ఎంతో ఉత్సాహాంగా ఫస్ట్డే ఓ థియేటర్కి వెళ్లా.
సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సంఘటన నన్ను ఎంతగానో బాధపెట్టింది. అప్పుడే ఇక థియేటర్కు వెళ్లకూడని నిర్ణయించుకున్నా. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్లోంచి ఇంకా పోలేదు.` అంటూ చెప్పుకొచ్చారు.