`క్రాక్`తో లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ్ రవితేజ.. `ఖిలాడి`తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డారు. ఇప్పుడీయన నుండి రాబోతున్న తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు.
సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 29న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే విడుదల దగ్గర పడుతున్నా రామారావు హడావుడి మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాను సైతం నెల రోజుల ముందు నుండే ప్రమోట్ చేస్తున్నారు. కానీ, `రామారావు ఆన్ డ్యూటీ` ప్రచార కార్యక్రమాలు మాత్రం ఇంకా స్పీడ్ అందుకోలేదు. సినిమాకు సంబంధించి అడపా తడపా అప్డేట్స్ వదులుతున్నారు మినహా.. ఎవరూ మీడియా ముందుకు రావడం లేదు. ఇంటర్వ్యూల్లో పాల్గొనడమూ లేదు.
అసలు రవితేజ సినిమా ఒకటి ఈ నెలలో విడుదల అవుతుందని ఎంత మందికి తెలుసు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటికై `రామారావు` అండ్ టీమ్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచుతారో..లేదో.. చూడాలి. కాగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్గా కనిపించబోతున్నాడు. అలాగే వేణు తొట్టెంపూడి పవర్ ఫువ్ పోలీస్ ఆఫీసర్గా అలరించబోతున్నాడు.