Rajasree: 50 లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాజశ్రీ. అందం అభినయం రెండు కలగలిపిన అరుదైన తార. ఎన్టీఆర్ తో అభినయించిన రామారావు తో జోడి కట్టిన పలువురు కథానాయకులతో ఆడి పాడి అభిమానులను మెప్పించగలిగే బిరుదు రాజశ్రీకే సొంతం. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క సెకండ్ హీరోయిన్ గా కూడా అవకాశాలు వస్తే వదులుకోలేదు. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను సమానంగా చేసిన ఈమె తన ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకుంది. అప్పట్లో రాజశ్రీ గ్లామర్ తారగా పేరు సంపాదించుకుంది కూడా. మనసులో ఉన్న మాటను నిర్భయంగా చెప్పేస్తూ తన గట్స్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.
భక్తాంబరి, మాంగల్యం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయింది రాజశ్రీ. తొలి రోజుల్లో కాంతారావు మరియు రామకృష్ణల కాంబినేషన్లో నటించింది. జానపద వేషధారణలో కొట్టొచ్చేలా కనిపించింది. సైవా మాస్టర్ దగ్గర నృత్యం నేర్చుకున్న రాజశ్రీ ఎక్కువ నృత్యం ప్రదర్శనలు ఉన్న పాత్రలకే ఇంట్రెస్ట్ చూపించేది. కానిస్టేబుల్ కూతురు, ఆధారణ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది రాజశ్రీ. ఇక రాజశ్రీకి విఠలాచార్య సినిమాల్లో వరస అవకాశాలు దక్కాయి. విఠలాచార్య మాటలు తన జీవితాన్ని మార్చేశాయని రాజశ్రీ పలుసార్లు వెల్లడించింది కూడా. కమర్షియల్ గా హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా అగ్గిపిడుగు. పిడుగు రాముడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన రాజశ్రీ.
ఇక రాజశ్రీ కి చాలా దగ్గరైన హీరో శోభన్ బాబు. బహుశా వీరిద్దరి వయసు మరియు ఆలోచనలు ఒకటి కావడమే ఇందుకు కారణం. అప్పటి కాంగ్రెస్ కాలంలో ఎమ్మెల్సీగా ఉన్న అధికారిని పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేసింది రాజశ్రీ. అప్పటికి అనేకమంది సినిమాల్లో నటించమని కోరినప్పటికీ నో చెప్పింది. ఇక అనంతరం భర్త మరణించడంతో విశాఖపట్నంలోని లోనే తన జీవితాన్ని కొనసాగించింది. జీవితంలో ఎంతో స్టార్డం ఉన్న ఈమె అనంతరం తిండికి కూడా మోహమాసింది. అంతలాగా చింతించింది మరి రాజశ్రీ. ఇక రాజశ్రీ తనకి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. అప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తకుండా తన జీవనాన్ని సాగించిన రాజశ్రీ ఉన్నట్టుండి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది.
అలా 40 సంవత్సరాలు దాకా పెళ్లి పై ఇంట్రెస్ట్ చూపించని రాజశ్రీ ఒక్కసారిగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అప్పటి కాలంలో 40 సంవత్సరాలకు పైగా ఒంటరి జీవితాన్ని గడిపిన మహిళగా కూడా నిలిచింది రాజశ్రీ. ప్రస్తుత కాలంలో 40 సంవత్సరాలు పాటు బ్రహ్మచార్యగా ఉండడం సాధారణ విషయమే. కానీ ఆనాటి రోజుల్లో 15 సంవత్సరాలకే బాల్యవివాహాలు చేసేవారు పెద్దవారు. అటువంటి జనరేషన్లో కూడా 40 సంవత్సరాల పాటు బ్యాచిలర్ లైఫ్ ను లీడ్ చేసింది రాజశ్రీ. ఏదేమైనా ఈమె పెళ్లి చేసుకుని ఇరకాటంలో పడిందని చెప్పుకోవచ్చు. పెళ్లికి ముందు ఎంతో హ్యాపీగా గడిపిన ఈమె పెళ్లి అనంతరం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.