టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `ది వారియర్`. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తే అక్షర గౌడ్, నదియ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం.. నిన్ననే గ్రాండ్గా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కర్నూలులో డీఎస్పీగా చార్జ్ తీసుకున్న సత్య అనే ఆఫీసర్ లోకల్ గూండా `గురు`ని ఎలా ఎదుర్కున్నాడనేది ఈ సినిమా ప్రధాన కథ. రోటీన్ కథే అయినప్పటికీ.. డైరెక్టర్ లింగుసామి ఓ కొత్త పాయింట్ యాడ్ చేశాడు.
అదేంటంటే.. డాక్టర్ అయిన హీరో పోలీస్గా మారడం. ఫస్టాఫ్లో డాక్టర్గా, సెకెండాఫ్లో పోలీస్గా రామ్ అదరగొట్టేశాడు. రామ్, ఆది పినిశెట్టిల నటన, కృతి శెట్టి గ్లామర్ షో, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.భారీ ట్విస్టులు లేకపోయినా, బోర్ కొట్టించకుండా కథను నడిపించడంతో లింగుసామి బాగానే సక్సెస్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. `ది వారియర్` సినిమా తెలుగు, తమిళ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. అందుకుగానూ సదరు సంస్థ రూ. 15 కోట్లు చెల్లించిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఇదే నిజమైతే ది వారియర్ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికినట్టే అని చెప్పాలి. ఇక మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాల్సి ఉంది.