Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఫిదా`తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ తనదైన అందం, అభినయంతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. అదే సమయంలో భారీ సంఖ్యలో అభిమానులను దక్కించుకుంది.
తెలుగింట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ల లిస్ట్ తీస్తే.. మొదట సాయి పల్లవినే ఉంటుంది. సుకుమార్ లాంటి దర్శకుడే ఆమెను లేడీ పవర్స్టార్ అని పిలిచారంటే ఆమెకున్న ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అభిమానులు సైతం సాయి పల్లవి ఎక్కడ కనిపిస్తే అక్కడ లేడీ పవర్ స్టార్ అంటూ హోరెత్తిస్తుంటారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా లేడీ పవర్స్టార్ అనే బిరుదును తాను తీసుకోనంటూ సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ `విరాట పర్వం`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. `లేడి పవర్స్టార్, లేడి సూపర్ స్టార్ అనే బిరుదలను అభిమానులు ఏదో ప్రేమతో ఇస్తున్నారు. కానీ నేను దానిని మనసుకు తీసుకోను. కథలను విన్నప్పుడు అవేవి పట్టించుకోను. జనాలకు నచ్చలే మంచి మంచి సినిమాల్లో నటించాలనే నా లక్ష్యం.` అంటూ చెప్పుకొచ్చింది. ఇక తక్కువ సినిమాలు చేస్తున్నానా? ఎక్కువ సినిమాలు చేస్తున్నానా? అన్న దానికంటే మంచి సినిమాలు చేస్తున్నానా అన్నదే నాకు ముఖ్యమని, తాను లేకపోయినా అందరికి తన సినిమాలు గుర్తుండాలని చెప్పుకొచ్చింది.