ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తే.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశాడు. అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ కలెక్షన్స్ను రాబట్టి ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతోంది. `పుష్ప ది రూల్` టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పార్ట్ 1తో ఎన్నో సంచలనాలు సృష్టించిన సుకుమార్.. `పుష్ప ది రూల్` కోసం అదనపు హంగులు సమకూర్చనున్నారట.
`పుష్ప 2`లో ప్రియమణి.. ఆ హీరోకు జోడీగా నటించబోతోందట?!
ఇక త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతున్న తరుణంలో.. ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. పార్ట్ 1లో `ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా` అనే ఐటెం సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసిన సమంత.. రెండో భాగంలో కూడా కనిపించబోతోందట. అయితే ఈ సారి ఆమె ఐటెం భామగా కాదండోయ్.
స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పరాజ్కి సహాయపడే పాత్రలో సామ్ కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె పాత్రను సుకుమార్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.