Allu Arjun: సెప్టెంబర్ 29వ తారీకు ఐకాన్ స్టార్ బన్నీ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు. భార్య పుట్టిన రోజు కావడంతో ఇద్దరు పిల్లలు అర్హా, ఆయన్ లతో కలసి ఆమె చేత బన్నీ కేక్ కట్ చేయించారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు “హ్యాపీ బర్త్ డే క్యూటి” అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో పంజాబ్ అమృత సార్ లో కుటుంబంతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని బన్నీ సందర్శించారు. అక్కడ సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడం జరిగింది.
ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అనంతరం పాకిస్తాన్ ఇండియా సరిహద్దు వాఘ వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ కుటుంబ సమేతంగా బిఎస్ఎఫ్ జవాన్ లతో కలిసి నడవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా బన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పుష్ప సినిమాతో బన్నీ క్రేజ్ రాష్ట్రాలకి కాదు దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయింది. పుష్ప దెబ్బకి బన్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. తగ్గేదేలే… శ్రీవల్లి సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులు… ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వరకు మొత్తం కంప్లీట్ చేసిన సుకుమార్ త్వరలోనే సెట్స్ ఫైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అల్లు కొత్త స్టూడియోలో.. మొదటిగా పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు అక్టోబర్.. నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే సినిమా విడుదల అయ్యేలా సుకుమార్ బన్నీ డిసైడ్ అయినట్లు టాక్.