`సర్కారు వారి పాట` హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేశ్కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఇందులో మహేశ్కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. రెగ్యులర్ షూటింగ్ను ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా చిత్రాలు వచ్చి.. ప్రేక్షకులను అలరించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మహేశ్, పవన్, ఎన్టీఆర్లపై `భీమ్లా` బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఇకపోతే ఈ నెల 9వ తేదీన మహేశ్ బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ `ఎస్ఎస్ఎమ్బీ 28` నుండి బిగ్ ట్రీట్ రెడీ చేస్తున్నారట. ఇంతకీ ఆ ట్రీట్ మరేంటో కాదు.. మహేశ్ బాబు ఫస్ట్ లుక్ అట. అలాగే సినిమా టైటిల్ను కూడా అదే రోజు అనౌన్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్ పండగా చేసుకోవడం ఖాయం అవుతుంది. కాగా, ఈ మూవీ పూర్తైన వెంటనే మహేశ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.