వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలు నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ శ్రుతిహాసన్నే హీరోయిన్ కాగా.. మాస్ మహారాజ్ రవితేజ ఒకే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం.
అయితే అటు చిరంజీవి, ఇటు బాలయ్య సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. కానీ, ఎవరు ముందు..? ఎవరు వెనక..? అన్నది మాత్రం వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి పోరులో చిరునే ముందు వస్తున్నాడట. జనవరి 11న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది అని తెలుస్తోంది.
ఇక జనవరి 12న `వీరసింహారెడ్డి` రిలీజ్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విజయ్ దళపతి `వారసుడు`, ప్రభాస్ `ఆదిపురుష్` చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ, `ఆదిపురుష్` సమ్మర్కు వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది.
https://newsorbit.com/entertainment-news/new-sentiment-on-balakrishna-veera-simha-reddy.html