Health Tip: ప్రస్తుత రోజుల్లో మానవ జీవితం గజిబిజిగా మారిపోయింది. ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం రాత్రి 7 అయితే గ్రామాలలో రాత్రి 9 అయితే పట్టణాలలో ఎవరికి వారు నిద్రలోకి జారుకునే వాళ్ళు. ఆ రోజులో పొద్దున్నే ఉదయం 4 లేదా 5కి లేచి తిరిగి తమ దైనందిన జీవితాల్లో చేయాల్సిన పనులు చేసుకునేవారు. మనుషులు కూడా చాలా బలంగా ఉండేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు మొత్తం తలకిందులు అయిపోయాయి. గ్రామాలలో పట్టణాలలో సైతం పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా టెక్నాలజీ రావటం ఇంటర్నెట్ అందుబాటులోకి ఉండటంతోపాటు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండటంతో మనిషి నిద్రకి చాలా దూరం అయిపోతున్నారు. దీంతో అనవసర రోగాలకు గురవుతున్నారు. సెల్ ఫోన్ స్క్రీన్ కాంతి కంటి రెప్పల పై పడటం… దానివల్ల రెప్పల పై ఉండే పదార్థం .. ఆరి పోవటంతో నిద్ర జారుకోవడానికి చాలా సమయం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక సెల్ ఫోన్ వల్ల మాత్రమే కాదు… అనేక పని పాటుల వల్ల కూడా.. మనిషి నిద్రకు దూరం అవుతున్నా పరిస్థితి ఉంది. దీంతో నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంకా చాలా కారణాల వల్ల నిద్రలేమి.. సమస్య ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు.
ఇటువంటి తరుణంలో ఒక చిన్న పాటి ట్రిక్ తో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేమిటంటే ఆయుర్వేదంలో అశ్వగంధ, సర్పగంధ పొడి నిద్రలేమి సమస్యకు బాగా ఉపయోగపడతాయట. ఈ విషయాన్ని ఆయుర్వేద నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముందుగా ఒక గిన్నెలో అశ్వగంధ ఆ తర్వాత సర్పగంధ పొడిని బాగా కలపాలి. ఇప్పుడు ఆ పొడి నుంచి నాలుగు, ఐదు గ్రాముల పొడిని తీసుకుని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటితో కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర రావటం తో పాటు ఒత్తిడి అదే రీతిలో ఆందోళన కూడా తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని.. ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.