ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి.వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే శరీరంలో కాల్షియం లోపం వలన కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.అవి రాకుండా ఉండాలి అంటే మేము. చెప్పే చిట్కాలను పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి. ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ చిన్న చిట్కా క్రమం తప్పకుండా పాటించి చూడండి.
కాల్షియం పెరగడానికి చిట్కా :
ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ గసగసాలు వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత ఒక గ్లాసు పాలు పోయాలి.ఆ తర్వాత అర స్పూన్ సోంపు, రుచికి సరిపడా పటిక బెల్లం, అర స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకుని 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించి ఆ పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా వారంలో మూడుసార్లు ఈ పాలను తాగితే శరీరంలో కాల్షియం లోపం, మెగ్నీషియం లోపం, పొటాషియం లోపం వంటివి తగ్గుతాయి.ఫలితంగా అలసట, నీరసం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి.గసగసాలలో ఉండే లక్షణాలు కాల్షియం లోపాన్ని తగ్గిస్తాయి.అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను
కూడా తింటూ ఉండాలి.