ఈ కరోనా ప్రభావం మూలంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. దీనిని కట్టడి చేయడానికి వివిధ దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నాయి. అయినా కరోనా విలయ తాండవం మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి రోజుకో కొత్త రూపాన్ని మనకు పరిచయం చేస్తూనే ఉంది. శాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలలో ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు తెలిపిన విషయం తెలిస్తే మీరు నవ్వుతారు. అలాగే భయం కూడా వస్తదేమో.. అదేనండి మనం వదిలే బాంబుల మూలంగా కరోనా వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. బాంబులు అంటే చంపడానికి వేసే బాంబులు కాదండోయ్.. మన శరీరం నుంచి విడిచే వాయువు.
కరోనా వచ్చిన మొదట్లో జ్వరం రావడం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాల వల్ల కరోనా వచ్చేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాగా కొద్ది మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించుకుండానే కరోనా సోకిందని కూడా వెల్లడించారు. కాగా తాజాగా చేస్తున్న పరిశోధనలో కరోనా లక్షణాలు మరిన్ని ఉన్నాయని తెలుపుతూనే ఉన్నారు నిపుణులు.
వాసనను గుర్తించకం పోవడం. కాళ్లపై ఎర్రగా చారలు రావడం, తరచుగా జ్వరం రావడం వంటివి కూడా కరోనాకు లక్షణంగా తెలిపారు. మరి ముఖ్యంగా కంటిపై కూడా కరోనా ప్రభావం చూపెడుతుంది. కండ్ల ద్వారా కూడా కరోనా తన లక్షణాన్ని తెలిపింది. అలాగే కాళ్ల వేళ్లు రంగు మారడం, కందిపోవడం, వాటిని తాకగానే నొప్పి పుట్టడం లాంటివి కూడా కరోనా లక్షణాలేనని యూరప్ పరిశోధకులు తేల్చారు. అయితే తాజాగా మరో దాని వల్ల కూడా కరోనా వచ్చే ప్రభావం ఉందని తెలిపారు.
మనం వదిలే అవపాన వాయువు (పిత్తులు) వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగా దగ్గువల్లనే కరోనా వస్తుందని అనుకుంటే ఇప్పుడు మనం వదిలే బాంబుల వల్ల కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. బహిరంగా ప్రదేశాలలో బాంబులేయొద్దని ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్ ప్రజలను హెచ్చరించారు. అయితే బహిరంగంగా ఈ వాయువును వదిలేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు ఈ గ్యాస్ ను వదలడం మూలంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని తెలిపారు.