మెదడులో పురుగులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. అదేనండి పెద్దలంటారుగా మెదడులో పురుగేమైనా తిరిగిందా రా నీకు అని అదే గుర్తొస్తుంటుంది కదా.. అదే నిజమైందండి.. అదెలాగంటారా ఇది చదివేయండి మరి.. తలనొప్పి అని డాక్టర్ కు చూపించుకున్న ఓ వ్యక్తి నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. తీవ్రమైన తలనొప్పితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఓ వ్యక్తి వైద్యుని సంప్రదించగా అది సాదారణమైన తలనొప్పిగా భావించి మందులు రాసిచ్చాడు. అయినప్పటికీ అతనికి తలనొప్పి తగ్గక పోగా ఇంకా తీవ్రంగా భాదించసాగింది.
దీంతో ఆ వ్యక్తి డాక్టర్ ను సంప్రదించారు. దాంతో డాక్టర్లు అతని మెదడుకు స్కాన్ చేయగా అందులో పరాన్న జీవులు కనిపించాయి. అవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. దీంతోవైద్యులు మరింత లోతుగా అతడిని మెదడుకు స్కాన్ చేయగా అవి సాధారణ పరాన్న జీవులు కావని అవి టేమ్ వర్మ్ (రిబ్బన్ తరహాలో పొడవుగా పాముల్లా ఉండే పురుగులు) అని తెలుసుకున్నారు. దానితో అతడి శరీరాన్ని కూడా స్కాన్ చేయగా ఛాతి, ఊపిరితిత్తులో కూడా అవి కనిపించాయి. సుమారుగా 700 టేప్ వర్మ్స్ అతడి అవయవాలను చుట్టేసినట్టు తెలుసుకున్నారు.
ఈ వింత జరిగింది చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తికి వచ్చిన సమస్య. దీన్ని ‘టైనియాసిస్’ అంటారని, టేప్ వార్మ్ పరాన్నజీవులు శరీరంలోని అవయవాల్లో చేరినప్పుడు ఈ వ్యాధి సోకుతుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం వైద్యుడు డాక్టర్ వాంగ్ జియాన్ రాంగ్ వెల్లడించారు. ఇది ప్రాణాంతమైనదని తెలిపారు.
భాదితుడు నెల రోజుల కిందట సరిగ్గా ఉడకని పంది మాంసాన్ని తినడం మూలంగా ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఆ మాంసం ద్వారానే టేప్ వార్మ్ లు అతడి శరీరంలోకి చేరి ఉంటాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం టేప్ వార్మ్ వంటి పురుగులు పంది మాంసంలో ఎక్కుగా ఉంటాయని తెలిపింది. ఆ మాంసాన్ని సరిగా ఉడికించకుండా తింటే వాటి అండాలు కేంద్ర నాడీ వ్యవస్థలోకి చేరుకుంటాయి. దాని మూలంగా నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. దీనితో పాటు తలనొప్పి, జ్వరాలు కూడా వస్తాయి. అలాంటిది తినాల్సి వచ్చినప్పుడు బాగా ఉడికించి తినండని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.