Health: ఇటీవల కాలంలో ఎక్కువ మంది కంప్యూటర్ ముందు కూర్చుని గంటల తరబడి పనిలో నిమగ్నమైపోతుంటారు. కంప్యూటర్ టేబుల్ వద్దనే కూర్చుని తిండి, కాఫీ, అల్పాహారాలు తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాది బారిన పడే ప్రమాదం ఉంది.
Health: మధుమేహం (షుగర్) వ్యాధి బారిన పడితే కనిపించే లక్షణాలు
త్వరగా అలసిపోవడం, నీరసం, శరీరం నిస్సత్తువగా మారడం, పనిలో ఆసక్తి లేకపోవడం, నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం, తరచు మూత్ర విసర్జన చేయడం, ఎక్కువ ఆహారం తీసుకుంటున్నా శరీరం బరువు తగ్గిపోవడం, కంటి చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, తరచు వ్యాధులకు గురి కావడం, కడుపులో నొప్పి, చర్మం మంటగా ఉండటం, గాయాలు త్వరగా మానకపోవడం, వృషణాలలో దురద, అంగంలో మంటగా ఉండటం, శృంగార కోరికలు సన్నగిల్లడం, చర్మం ముడత పడటం, రక్తహీనత, ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం లక్షణాలు కనబడతాయి.