Lungs: చాలా మందికి సీజన్ మారిన వెంటనే దగ్గు,జలుబు,గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్యల వంటి అనారోగ్యాలతో తరుచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే మేము చెప్పే ఈ టీ తాగితే మీ శ్వాసనాళాలు శుభ్రం అవ్వడంతో పాటు మీ ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు వచ్చేసి ఊపిరితిత్తులు క్లియర్ అవుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ స్పెషల్ టీ ఎలా తయారుచేయాలో చూసేద్దామా. ముందుగా ఈ టీ కు కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దాం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కావలిసిన పదార్ధాలు :
ఆపిల్-1
ఉల్లిపాయ -1
వెల్లుల్లి రెబ్బ -1
అల్లం ముక్క -కొద్దిగా
దాల్చిన చెక్క పొడి -1/4 టీ స్పున్
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముందుగా ఆపిల్ ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బను తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా కొద్దిగా అల్లం ముక్కను కూడా తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పైన చెప్పినవన్ని ఆ గిన్నెలో వేసి 5 గ్లాస్ ల నీటిని పోయండి.ఆ నీటిలోనే పావు స్పూన్ దాల్చినచెక్క పొడి కూడా వేసి మొత్తం ఒకసారి గరిటేతో తిప్పి స్టవ్ మీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ డ్రింక్ ను తాగాలి. ఈ డ్రింక్ లో ఒక స్పూన్ తేనె కలిపి కూడా తాగవచ్చు. ఈ డ్రింక్ ను ప్రతి రోజు ఉదయం,సాయంత్రం ఒకసారి తాగితే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది.ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.