Sleep ఈ మధ్యకాలంలో చాలామంది నిద్రలేమి సమస్య బాధపడుతున్నారు.. మారిన జీవన శైలి, నేటి ఆహారపు అలవాట్లు, ఒత్తిడి పనులు వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ సమస్య ను నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన ఇంట్లో వంట గదిలో ఉండే ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!!
ఈ చిట్కా కోసం ఒక కప్పు చొప్పున జీడిపప్పులు, పల్లీలు, సోయాబీన్స్ గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదంపప్పు ఇలా అన్ని తగిన మోతాదులో తీసుకొవాలి.. ఒక పాన్ లో డ్రై అయ్యేంత వరకు వేయించుకొవాలి.. ఈ పొడిలో కొంచెం బెల్లం తురుమును టేస్ట్ కి సరిపడా కొంచెం మాత్రమే తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు బెల్లం లేకుండా తీసుకోవాలి.
కాస్త ఓపిక చేసుకుని ఈ పొడిని ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే.. దాదాపుగా నెల రోజులు పాటు అయినా నిల్వ ఉంటది. ఈ పొడిని రోజు సేవించడం వలన రక్త శుద్ధి జరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వయసు పెరిగినాక వచ్చే సమస్య అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. కంటి నిండా నిద్ర పడుతుంది. రాత్రి నిద్ర పోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర వస్తుంది..ఈ రెమిడిని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పొడిని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా వాడవచ్చు.