corona: కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రజలను వ్యాక్సిన్ వైపు మరింతగా ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు ఆసక్తికర ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి.సెలియో, మెక్డోనాల్డ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
Read More: Corona: షాక్ః కరోనా టీకా డోసుల మధ్య గ్యాప్ ప్రమాదకరమట…
ఆఫర్లే ఆఫర్లు…
కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ నెల 10వ తేదీ నాటికి ఉన్న డేటా ప్రకారం 24 కోట్ల మందికి పైగా అంటే సుమారు 22 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. మరింత మందికి ఈ వ్యాక్సిన్ అందించేందుకు కార్పొరేట్ కంపెనీలు వస్తువుల కొనుగోళ్లపై రివార్డులు ఇస్తుంటే, బ్యాంకర్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ క్లాథింగ్ కంపెనీ సెలియో పౌరులకు ఆఫర్ల మెసేజ్లు పంపుతున్నది. ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు తమ షాప్లో వస్తువులు కొంటే 300 రివార్డు పాయింట్లు ఇస్తామని సెలియో పేర్కొంది. కో బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మదుపు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇక రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్.. వ్యాక్సినేసన్ను ప్రోత్సహించేందుకు తమ ప్రొడక్టులపై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. నార్త్ అండ్ ఈస్ట్ ఇండియా ప్రాంతాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న మెక్ డొనాల్డ్ సీవోవో రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి పిజ్జాలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైదరాబాద్లో కరోనా టీకా
మార్కెటింగ్ అనుకోవాలా?
వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి పలు ఆఫర్లు అందుబాటులోకి తేవడం వెను…వ్యాక్సినేషన్ కూడా మార్కెటింగ్కు ఒక అవకాశంగా ఉపయోగించుకోవడం అని నిపుణులు పేర్కొంటుననారు. కస్టమర్లు చాలా కాలం తర్వాత షాప్లను సందర్శింప చేయడంలో ఈ ఎత్తుగడ కీలకం కానుందని చెప్తున్నారు. సామూహిక వ్యాక్సినేషన్ ప్రజా భద్రతలో కీలక బాధ్యత వహిస్తుండటమే కాకుండా బిజినెస్ పురోభివ్రుద్ధి సాధిస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికీ వ్యాక్సిన్ కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే.