మన జాతీయ గీతం ‘జనగణమన’ లో కొన్ని అనవసర పదాలు ఉన్నాయని ఆ పదాలను మార్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోరుతున్నారు. ఈ ఐ=విషయం గురించి నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. మన జాతీయ గీతం లోని అనవసర పదాలను తొలగించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. ఈ ప్రతిపాదన నేటిది కాదని జాతీయ గీతంలోని అనవసర పదాలను తొలగించి, దానిని సవరించాలని 1949 లో నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోరారని సుబ్రమణ్య స్వామి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
నాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ, 21 అక్టోబరు 1943 న ఇంఫాల్ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆలపించిన గీతాన్నే ఇప్పుడు అమలులోకి తీసుకురావాలని నిన్న సుబ్రమణ్య స్వామి ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా ఈ విషయమై రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారని గుర్తుచేస్తూ ఆ గీతంలో పేర్కొన్న సింధ్ ప్రాంతం ఇప్పుడు భారత దేశంలో లేనందున ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని మన జనగణమన లో జోడించాలని ఆయన కోరారు.