చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి లోకేష్ బాబును వైసిపి వారు పప్పు అని ఏడిపిస్తుంటారు.ఇందుకు ముఖ్యమంత్రి ఇందుకు టిడిపి వారు ముఖ్యమంత్రి జగన్ ని గన్నేరు పప్పు అని కౌంటర్ ఇస్తూ వచ్చారు.
ఇప్పుడు ఇంకా టిడిపి వాళ్లు రెచ్చిపోయే అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ వారికి తానే ఇచ్చేశాడు.తాజాగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వైఎస్ జగన్ నోట చాలా తప్పులు దొర్లేశాయి.ప్రసంగ పాఠాన్ని జగన్ తన ఎదురుగా పెట్టుకుని చదివినప్పటికీ తప్పులు దొర్లాయి.అప్పటి నుంచి టిడిపి వారు ఆయనపై విమర్శల దాడి ప్రారంభించారు! గన్నేరు పప్పు అనే హ్యాష్టాగ్తో వారు సాగిస్తున్న విమర్శలకు వైసిపి వాళ్లు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.సీఎం నోట అని ఆణిముత్యాలని సెటైర్లు విసురుతున్నారు .
‘సూళ్లలో ఇంగ్లీష్ మీడియం అంటున్నావు! నీకే తెలుగు రాదు అది సరిగ్గా నేర్చుకోవాలి’అని టిడిపి జగన్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతోంది. గతంలో నారా లోకేష్ మాటలు తడబడి నప్పుడు వైసిపి వాళ్ళు చెలరేగిపోయారు.తెలుగు మాట్లాడటం రాని మూర్ఖుడు’ అంటూ వైసీపీ నేతలు లోకేష్ మీద విరుచుకుపడ్డారు.’ జయంతికీ వర్ధంతికీ తేడా తెలియదా.?’ అంటూ ఎగతాళి చేశారు! ఇప్పుడు టిడిపి వారికి అవకాశం వచ్చింది.వదులుకోరు కదా!దెబ్బకు దెబ్బ అని ఊరికే అనలేదు!రాజకీయాల్లో ఇవన్నీ సహజమనుకోండి!
కాకుంటే ఎదుటివారిపై వేలెత్తి చూపే ముందు తమవైపు నాలుగు వేళ్లు చూస్తున్నాయన్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి!ప్రసంగాల్లో తప్పులు దొర్లడం పెద్ద నేరమేమీ కాదు. దాన్ని కేవలం పొరపాటుగానే భావించాలి. ఆ తప్పులను ఎత్తి చూపుతూ పప్పు ,గన్నేరు పప్పు అంటూ ఒకరికి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం కూడా సరికాదు.ఎవరైనా సరే నోరు అదుపు చేసుకుంటే రాళ్ల దెబ్బలు తప్పుతాయి. లేదా ఇప్పుడు జగన్ కు వచ్చిన పరిస్థితే ఎదురవుతుంది!