BREAKING: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కొద్దిరోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, దేవ కట్టా కాంబినేషన్ లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ ను అతని మామయ్య చిరంజీవి రిలీజ్ చేశారు. అలాగే తన మేనల్లుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దాంతో అల్లుడిపై చిరంజీవి చూపించిన ప్రేమ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కూడా సాయి ధరమ్ తేజ్ కోసం రంగంలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. గతంలో జరిగిన ఈ సినిమా ఓపెనింగ్కి కూడా పవన్ కల్యాణ్ గెస్ట్గా వచ్చి తనకిష్టమైన మేనల్లుడికి అండగా నిలిచారు. ఇకపోతే అక్టోబర్ 1వ తేదీన రిపబ్లిక్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.