తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దుబ్బాకలో అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు రావడంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని పార్టీ కేడర్లో ఆశలు చిగురించాయి.
దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ పై దూకుడు గా రాణిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కమలనాధులు. ఇదిలా ఉండగా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర అదేవిధంగా బస్సు యాత్ర చేయడానికి ఏర్పాట్లు అంతర్గతంగా చేసుకుంటున్నట్లు సరికొత్త వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలు పూల్ పవర్స్ బండి సంజయ్ కి ఇచ్చినట్లు పార్టీలో టాక్ వినపడుతోంది.
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత బండి సంజయ్ పాదయాత్ర ప్రకటన వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఏదో రీతిలో ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకువచ్చి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు టిఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారటంతో.. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో బీజేపీ తెలంగాణ ప్రజలు పట్టం కడతారని బండి సంజయ్ భావిస్తున్నట్లు సమాచారం. చాలా వరకూ పాదయాత్రలు చేసిన నాయకులు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సక్సెస్ కావడమే కాక ముఖ్యమంత్రి అవ్వటంతో ఇదే ఫార్ములాను ఉపయోగించి తాను సీఎం అవ్వాలని బండి సంజయ్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తోంది.