గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్బాబు రాజీనామా చేశారు.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్బాబును చంద్రబాబు మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో మనస్థాపానికి గురైన రావెల టిడిపికి గుడ్బై చెప్పి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి రావెల ఓడిపోయారు.
రావెల శనివారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రావెల పేర్కొన్నారు.