Photo Courtesy: ANI
పనాజీ: 16:26 గంటలు: రన్వేకు మరమత్తుల తర్వాత గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో మళ్లీ విమానిల రాకరోకలు మొదలయ్యాయి.
మొదటి రిపోర్టు: గోవా అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం మూతపడింది. మిగ్ 29కె యుద్ధవిమానం ఒకటి గాల్లోకి లేచే సమయంలో ఆయిల్ ట్యాంక్ను జారవిడవడంతో ప్రమాదం సంభవించింది. గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు టేకాఫ్కూ ల్యాండింగ్కూ ఉపయోగించే రన్వేపై ఇంధనం పడి మంటలు అంటుకున్నాయి. ఫలితంగా రన్వే కొద్దిగా పాడయింది. దీనివల్ల గోవా విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కొన్ని గంటలపాటు నిలిపివేశారు. భారత నౌకదళం సిబ్బంది అక్కడకు చేరుకుని రన్వే మరమ్మత్తులు చేస్తున్నారు.
ఇంధనం ట్యాంకు జారవిడిచిన యుద్ధవిమానం సురక్షితంగానే ఉంది. యుద్ధవిమానాల్లో ఇంధనం ట్యాంకులు సాధారణంగా లోపలే ఉంటాయి. విమానం మరింత దూరం ప్రయాణించేందుకు వీలుగా విమానం బాడీ బయట కూడా రెండు ట్యాంకులు అమరుస్తారు. అలాంటి ట్యాంకు ఒకటి విమానం టేకాఫ్ సమయంలో ఊడి కిందపడింది. ఫలితంగా రన్వేపై అగ్నికీలలు ఎగశాయి.
Spokesperson Navy: Goa Airport closed temporarily for a few hours in view of fire caused by a drop tank of MiG 29K which got detached whilst taking off. All efforts in hand to resume flights as soon as possible. MiG 29K fighter aircraft is safe. (Pic courtesy: Spokesperson Navy) pic.twitter.com/dpPbMhBodV
— ANI (@ANI) June 8, 2019