(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రభుత్వ విప్, మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును రైతులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్లో కొందరు రాళ్లతో దాడి చేయడంతో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నది. నిరసన కారులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.