ముంబై: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ) విద్యార్థులపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళన కొనసాగుతుండగా.. ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ దర్శనం ఇవ్వండి సంచలనం అయింది. జేఎన్యూ విద్యార్థులపై దాడికి నిరసనగా గత ఆదివారం(జనవరి 5) రాత్రి నుంచి వేలాది మంది ఆందోళనకారులు గేట్ వే ఆఫ్ ఇండియా వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓ యువతి ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ ను ప్రదర్శించింది. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు యువతి పేరు మెహక్ మీర్జా ప్రభుగా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ సంగ్రామ్ సింగ్ నిశాందర్ తెలిపారు.
మరోవైపు ఈ పోస్టర్ వ్యవహారంపై మహారాష్ట్రలోని ఉద్ధవ్ ప్రభుత్వాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ టార్గెట్ చేశారు. “నిరసన ఖచ్చితంగా దేనికి? ఫ్రీ కాశ్మీర్ నినాదాలు ఎందుకు?ముంబైలో ఇటువంటి వేర్పాటువాద అంశాలను మనం ఎలా సహించగలం ఉద్ధవ్ గారు. ఫ్రీ కాశ్మీర్ లాంటి నినాదాలతో యాంటీ ఇండియా ప్రచారాన్ని మీకు సహించబోతున్నారా ?” అని ఫడ్నవీస్ ప్రశ్నించారు.
Protest is for what exactly?
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqA— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020
ఇదిఇలా ఉంటే.. గేట్ వే ఆఫ్ ఇండియాను ఖాళీ చేయాలని నిరసనకారులకు పోలీసులు సూచించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి ఆజాద్ మైదాన్ కు తరలించారు. ఈ క్రమంలో ఒకింత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది.