BREAKING : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసింది. వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు ఈడీ అధికారులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ ప్రదేశానికి చేరుకుంటున్నాయని తేలింది. అయితే ఒక్క గ్రాము కొకైన్ ను సుమారు రూ.10 వేలకు విక్రయిస్తున్నారని తెలిసింది. అలాగే టాలీవుడ్ డ్రగ్ కేసు వ్యవహారంలో పోలీసులకు చిక్కిన కెల్విన్కు షికాగోలోని ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నట్టు విచారణలో తేలింది.
అమెరికా దేశం నుంచే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశామని కెల్విన్ ఈడీ దర్యాప్తులో వెల్లడించాడు. డార్క్ వెబ్ వేదికగా మత్తు మందులు ఆర్డర్ ఇచ్చి ఇంటర్నెట్ ద్వారా డబ్బులు చెల్లించినట్లు తెలిపాడు. కొరియర్ సేవల సహాయంతో అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి మత్తుమందులు దిగుమతి చేసుకునేవారమని అతడు చెప్పుకొచ్చాడు. 3 ప్రైవేట్ కొరియర్ సంస్థలు, తపాలా సేవల ద్వారా డ్రగ్స్ సరఫరా చేశామని.. వాటికి చెల్లింపులు అనేవి ఎక్కువగా బిట్కాయిన్ ద్వారానే జరిగేవని వెల్లడించాడు.
BREAKING: న్యాయరాజధానిగా కర్నూలు.. అప్పుడే పడిన తొలి అడుగు..!