అమరావతి, ఫిబ్రవరి 25: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.
అదే రోజు ఆ ఇంటి ఆవరణలోనే నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని వైసిపి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యకమాలకు వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు అందరూ పాల్గొనాలని వైవి సుబ్బారెడ్డి ప్రకటనలో ఆహ్వనించారు.